హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 18 (నమస్తే తెలంగాణ): రామకృష్ణ మఠ్ ఆధ్వర్యం లో సమ్మర్ శిక్షణ తరగతులు ఆన్లైన్, ఆఫ్లైన్లో నిర్వహిస్తున్నట్టు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. డ్రాయింగ్, అన్నమాచార్య కీర్తనలు, యోగాసనాలు, పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ అండ్ కౌన్సెలింగ్, మైండ్మేనేజ్మెంట్ టెక్నిక్స్ తదితర కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు నిర్వాహకులు పేర్కొన్నారు. rkmath.org/vihe వెబ్సైట్ లో, 040276 27961, 91772 32696 (వాట్సాప్) నంబర్లలో సంప్రదించాలని సూచించారు.