హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోషియేన్ (ట్రెసా) హైదరాబాద్ శాఖ నూతన కార్యవర్గం ఎన్నికైంది. హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కే రామకృష్ణ (తాసిల్దార్), అసోసియేట్ ప్రెసిడెంట్-1గా పీ వేణుగోపాల్ (తాసిల్దార్), అసోసియేట్ ప్రెసిడెంట్-2గా కే బాలశంకర్ (తాసిల్దార్), ఉపాధ్యక్షులుగా ఎండీ యూనస్, సయ్యద్ అబ్దుల్ ఇర్షద్, సీహెచ్ లలిత, జీ అశ్విన్కుమార్ ఎన్నికయ్యారు. కార్యదర్శిగా కిశోర్, సహాయ కార్యదర్శులుగా బీ సాయి సత్యనారాయణరాజు, డీ గంగప్రసాద్, ఎస్ రామకృష్ణ, ఏ మోహన్, కోశాధికారిగా ఏ రాజేశ్వర్, కార్యవర్గ సభ్యులుగా జుబేదున్నీసా బేగం, ఎస్ సాయిరాం, సీ వంశీకృష్ణ, జే ప్రదీప్కుమార్, యాసిన్, జే అశ్విన్కుమార్, సునీల్కుమార్, గులామ్ ఖలీమ్, టీ నరేశ్కుమార్, వై గిరిజ ఎన్నికయ్యారు.