కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్రావుపేటకు చెందిన రామచంద్రారెడ్డి జాతీయ స్థాయి ఉత్తమ రైతు అవార్డు అందుకున్నారు.
2023 సంవత్సరానికి గాను భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి, కృషి జాగరణ్ సంస్థలు రామచంద్రారెడ్డిని ఉత్తమ రైతుగా ఎంపిక చేయగా బుధవారం రాత్రి ఢిల్లీలో నిర్వహించిన జాతీయ మేళాలో కేరళ మాజీ గవర్నర్ సదాశివం, మహేంద్ర గ్రూప్స్ అధినేత రాజమహేంద్ర చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు.
– చొప్పదండి (రామడుగు)