బంజారాహిల్స్, డిసెంబర్ 22: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిందితుడు (ఏ1) రామచంద్రభారతిని నకిలీ పాస్పోర్టు కేసులో బంజారాహిల్స్ పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రామచంద్రభారతి నకిలీ ఆధార్కార్డు, పాన్కార్డు, డ్రైవింగ్ లైసెన్స్తో మోసం చేశాడం టూ తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆయన ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొన్న సిట్ అధికారులు అతడికి రెండు వేర్వేరు పేర్లతో పాస్పోర్టులు ఉన్నట్టు గుర్తించి చర్యలు తీసుకోవాలని బంజారాహిల్స్ పోలీ సులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ కేసులో నాంపల్లి 3వ మెట్రోపాలిటన్ కోర్టులో లొంగిపోయేందుకు వచ్చిన రామచంద్రభారతిని పోలీసులు అరెస్ట్ చేశారు.