హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిందితుడు అయిన రామచంద్ర భారతిని బంజారాహిల్స్ పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. నకిలీ పాస్ పోర్టు కేసులో రామచంద్ర భారతిని అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అనంతరం ఆయనను నాంపల్లి కోర్టులో హాజరు పరచగా, జ్యుడిషీయల్ రిమాండ్ విధించింది. దీంతో భారతిని చంచల్గూడ జైలుకు తరలించారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రామచంద్ర భారతి బెయిల్పై విడుదలైన సంగతి తెలిసిందే. నకిలీ పాస్ పోర్టు కేసులో అతని ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా, ఫోర్జరీ సంతకాలతో నకిలీ పత్రాలు సమర్పించి పాస్పోర్టు పొందినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో తేలింది. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.