హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): సినిమా రంగంలో రాం గోపాల్ వర్మ ఓ సంచలనం. ఉన్నది ఉన్నట్టుగా.. మోహమాటం లేకుండా మాట్లాడటంలో ఆయనకు ఆయనే సాటి. విభిన్న వ్యక్తిత్వంతో అందరికి భిన్నంగా ఆలోచించే ఆయన బుధవారం పలువురు సివిల్స్ అభ్యర్థుల సందేహాలను తీర్చారు.
హైదరాబాద్ అశోక్నగర్లోని క్రిష్ణప్రదీప్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీలో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పలు సమకాలీన అంశాలపై తన అభిప్రాయాలను పంచుకొన్నారు. హోమో సెక్సువల్ హక్కులు, ఎల్జీబీటీ, సేమ్ సెక్స్ మ్యారేజెస్, సుప్రీంకోర్టు తీర్పు లు, ప్రస్తుత విద్యావిధానం, కుటుంబ వ్యవస్థ, మహిళల పట్ల సమాజం తీరు వంటి అంశాలపై విద్యార్థుల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. విద్యావిధానం వర్తమాన అవసరాలకు తగినట్టుగా ఉండాలని, ఎల్జీబీటీల పట్ల సమాజ దృక్పథం మారాలని ఆయన పిలుపునిచ్చారు.