సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ-దాచారం గ్రామాల సమీపంలోని వ్యవసాయ పొలాల్లో మంగళవారం ఓ కొండగొర్రె, రెండు జింకలు ఒక్కచోట చేరి సందడి చేశాయి. వర్షాలు కురుస్తుండటంతో పరిసరాలు పచ్చగా మారాయి. వన్యప్రాణులు ఇటువైపు వచ్చి పచ్చిగడ్డి మేస్తున్నాయి.