హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): చేనేతపై జీఎస్టీని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ఈ నెల 7న హ్యాండ్లూమ్ మార్చ్ను భారీ స్థాయిలో నిర్వహించనున్నామని అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు వెంకన్న వెల్లడించారు. ఆయన ఢిల్లీ తెలంగాణ భవన్లో శనివారం మీడియాతో మాట్లాడారు. దేశంలో తొలిసారిగా చేనేతపై పన్నులు విధించిన నీచ చరిత్ర మోదీ ప్రభుత్వానిదేనని, దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదని మండిపడ్డారు.
సోమవారం ఉదయం 8 గంటలకు ఎర్రకోట నుంచి రాజ్ఘాట్ వరకు హ్యాండ్లూమ్ మార్చ్, మధ్యాహ్నం 3 గంటలకు కాన్స్టిట్యూషన్ క్లబ్లో చేనేత డిక్లరేషన్పై రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉంటుందని చెప్పారు. సమావేశంలో అఖిల భారత పద్మశాలి యువజన సంఘం జాతీయ ఇన్చార్జి అవ్వారి భాసర్, సంఘం సీనియర్ నాయకుడు స్వర్గం రవి, రాజకీయ విభాగం అధ్యక్షుడు రమేశ్, స్వర్గం నర్సయ్య పాల్గొన్నారు.