సంస్థాన్ నారాయణపురం, అక్టోబర్ 21: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావుకు చుక్కెదురైంది. సంస్థాన్ నారాయణపురం మండలం లింగవారిగూడెం పరిధిలో బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారానికి వచ్చిన ఆయనను గ్రామస్థులు అడ్డుకున్నారు. సామాన్యుల నడ్డి విరిచేలా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని, తమ గ్రామంలో బీజేపీని ప్రచా రం చేయనివ్వబోమని ఆగ్రహించారు. ఊళ్లోకి రానివ్వకుండా బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ముడున్న రేండ్లు ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్రెడ్డి తమ గ్రామంలో ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని, ఏ ముఖంతో ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు.