హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర చాంబర్ ఆఫ్ మున్సిపల్ చైర్మన్గా చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ రాజు వెన్రెడ్డి ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యంరెడ్డి, ఉపాధ్యక్షురాలిగా వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ సీహెచ్ మంజుల ఎన్నికయ్యారు.
ఆదివారం హైదరాబాద్లోని ఒక హోటల్లో నిర్వహించిన సమావేశంలో కార్యవర్గాన్ని ఎన్నుకొన్నారు. ముఖ్య సలహాదారులుగా బీఎస్ కేశవ్(గద్వాల), కే నరేందర్ (షాద్నగర్), ఏ నర్సింహ(దేవరకొండ), పీ జమున(జనగామ) ఎంపికయ్యారు. ఈ సందర్భంగా రాజు వెన్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు.