హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): మహిళా బిల్లులో బీసీ కోటా ప్రస్తావించడంతోపాటు, వెంటనే పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్వర్ యాదవ్ డిమాండ్ చేశారు. లేదంటే రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదని ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. కులగణన చేపట్టాలని, కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.