హైదరాబాద్, ఫిబ్రవరి 25(నమస్తే తెలంగాణ): అవినీతి రహిత సమాజమే లక్ష్యంగా యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పనిచేస్తుందని నూతన కమిటీ జాతీయ అధ్యక్షుడు రాజేంద్ర పల్నాటి తెలిపారు. శనివారం హైదరాబాద్లో జరిగిన సమావేశంలో ఆయనతో పాటు సంస్థ నూతన కమిటీని ఎన్నుకున్నారు.
అనంతరం రాజేంద్ర మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అన్నిరాష్ట్రాల్లో సంస్థను బలోపేతం చేయనున్నామని చెప్పారు. జాతీయ సలహాదారులుగా సీబీఐ రిటైర్డ్ జేడీ లక్ష్మీనారాయణ, మాజీ అడిషనల్ చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రా, మాజీ ఆర్టీఐ కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లు, రాజు ఐపీఎస్, ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళితో పాటు మరికొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఎంచుకున్నట్లు తెలిపారు.