కాచిగూడ,అక్టోబర్ 9: పాలకులు బీసీలను ఓటు బ్యాంక్గా మాత్రమే వాడుకుంటున్నారని జాతీయ బీసీ మహాసభ అధ్యక్షుడు రాజేందర్పటేల్గౌడ్ ఆరోపించారు. గురువారం కాచిగూడలో విలేకరుల ఆయన మాట్లాడుతూ 56 శాతం ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతో ఆ పార్టీని బీసీలు గెలిపించారని పేర్కొన్నారు.
బీసీల పోరాటం ఫలితంగానే ప్రభుత్వం దిగివచ్చి 25 శాతం నుంచి 42 శాతానికి పెంచేందుకు నిర్ణయించిందని గుర్తుచేశారు. రిజర్వేషన్లపై సీఎం రేవంత్కు చిత్తశుద్ధి లేక అధిష్ఠానంతో చర్చించలేదని, ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడలేదని మండిపడ్డారు.