పార్కింగ్ అలాట్మెంట్ సైతం ముందే బుక్ చేసుకోవాలి
రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు డబ్బు చెల్లింపునకు మార్గదర్శకాలు
హైదరాబాద్, జూలై 4(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పరిధిలోని బండ్లగూడ, పోచారంలో రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు ఎంపికైన లబ్ధిదారులు ఈ నెల 12లోగా 10 శాతం టోకెన్ అడ్వాన్స్ చెల్లించాలని అధికారులు తెలిపారు. లాటరీలో ఎంపికైన లబ్ధిదారుల జాబితాను www.hmda.gov.in, www.swagruha.telangana.gov.in వెబ్సైట్లలో అందుబాటులో ఉంచామని, మంగళవారం నుంచి 12వ తేదీ సాయం త్రం 5 గంటలలోపు టోకెన్ అడ్వాన్స్ చెల్లించినవారికే ఫ్లాట్లు కేటాస్తామని స్పష్టం చేశారు.
టోకెన్ అడ్వాన్స్ చెల్లించదల్చుకొన్నవారు www.swagruha. telangana.gov.in వెబ్సైట్లో అప్లికేషన్ ఐడీ, ఆధార్ నంబర్ను ఎంటర్ చేసి ఇంటిమేషన్ లెటర్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఆ లెటర్లో పేర్కొన్న బ్యాంక్ ఖాతాలోకి నేరుగా ఆన్లైన్ ద్వారా లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా డబ్బులు పంపాలని పేర్కొన్నారు. టోకెన్ అడ్వాన్స్ చెల్లించాక ‘లెటర్ ఆఫ్ అలాట్మెంట్ కమ్ కన్ఫర్మేషన్’ను అందజేయనున్నట్టు తెలిపారు. అనంతరం ఫ్లాట్ మొత్తం విలువలో 80 శాతాన్ని 60 రోజుల్లో, ఆ తర్వాత మిగిలిన మొత్తాన్ని 30 రోజుల్లో చెల్లించాలని వివరించారు. కారు పార్కింగ్ కావాలనుకునేవారు అదనంగా డబ్బులు చెల్లించాలని, టోకెన్ అడ్వాన్స్తోపాటే పార్కింగ్ అలాట్మెంట్ను బుక్ చేసుకోవాలని పేర్కొన్నారు. స్టిల్ట్ పార్కింగ్కు రూ.3.25 లక్షలు, సెల్లార్ పార్కింగ్కు రూ.2.25 లక్షలు, ఓపెన్ పార్కింగ్కు రూ.లక్ష చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.