కష్టపడేవారికి పార్టీలో గుర్తింపు తథ్యం
ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్గా రాజీవ్సాగర్ బాధ్యతల స్వీకరణలో ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): దేశంలో మార్పు తీసుకొనిరావడం ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే రాజకీయాలు నడుస్తున్నాయని, వాటిని ఎదుర్కొనే సత్తా సీఎం కేసీఆర్కే ఉన్నదని చెప్పారు. పార్టీలో కష్టపడి పని చేసేవారికి తగిన గుర్తింపు తప్పకుండా వస్తుందని, అందుకు రాజీవ్సాగర్ ఉదాహరణ అని చెప్పారు. రాష్ట్ర ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్గా మేడే రాజీవ్సాగర్ బుధవారం జూబ్లీహిల్స్లోని కార్యాలయంలో మంత్రులు జీ జగదీశ్రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. రాజీవ్సాగర్కి వచ్చిన గుర్తింపు జాగృతి కార్యకర్తలకు, తెలంగాణ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొన్న యువ మిత్రులకు వచ్చిన గుర్తింపుగా భావిస్తున్నట్టు తెలిపారు. గత ఎనిమిదేండ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధి కండ్ల ముందే కనిపిస్తున్నప్పటికీ, కొంతమంది కేసీఆర్పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఇలాంటివారు ఉద్యమ సమయంలో ఎకడ ఉన్నారో అందరికీ తెలుసునని పేర్కొన్నారు.
కేసీఆర్పై అవాకులు, చవాకులు పేలుతున్నవారి నెత్తి మీద రూపాయి పెడితే అర్ధరూపాయి విలువ కూడా చేయరని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు సైద్ధాంతిక పోరాటం చేయాలని, దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఫుడ్స్ సంస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థను విస్తరించాలని సూచించిందని తెలిపారు. అంగన్వాడీలకు, బాలింతలకు అవసరమైన ఆహారాన్ని నాణ్యతతో అందిస్తున్నదని కొనియాడారు.
కార్యక్రమానికి మంత్రులు మహమూద్అలీ, వేముల ప్రశాంత్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, వీ శ్రీనివాస్గౌడ్, ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ప్రభుత్వ విప్లు గొంగడి సునీత, ఎమ్మెస్ ప్రభాకర్, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, ప్రకాశ్గౌడ్, ఏ జీవన్రెడ్డి, మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, ముఠా గోపాల్, శానంపుడి సైదిరెడ్డి, భాసర రావు, స్టీఫెన్సన్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీలు నవీన్రావు, వీ గంగాధర్గౌడ్, రఘోత్తంరెడ్డి, బీసీ కమిషన్ సభ్యుడు కే కిశోర్గౌడ్, కార్పొరేషన్ చైర్మన్లు అయాచితం శ్రీధర్, గజ్జెల నగేశ్, సతీశ్రెడ్డి, రావుల శ్రీధర్రెడ్డి, దూదిమెట్ల బాలరాజ్, సాయిచంద్, కొలేటి దామోదర్, మంత్రి శ్రీదేవి, జీ రామకృష్ణారెడ్డి, అనిల్ కూర్మాచలం, వాసుదేవ్రెడ్డి, వీ వెంకటేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు పురాణం సతీష్, పూల రవీందర్ తదితరులు హాజరయ్యారు. రాజీవ్సాగర్కు మాల మహానాడు, ఎమ్మార్పీఎస్, సమత సైనికదళ, క్రైస్తవ సంఘాలు,అంగన్వాడీ, ఆశ, ఎలక్ట్రిసిటీ, టీఎన్జీవో సంఘాల నాయకులు,పాస్టర్లు, తెలంగాణ జాగృతి నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.