బీజేపీ రాజస్థాన్ నాయకుడు లాదులాల్ పిటాలియా ప్రశంస
కట్టంగూర్, జూన్ 22: బతుకుదెరువు కోసం ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన కార్మికులకు తెలంగాణ ప్రభు త్వం ఎలాంటి ఇబ్బందులు లేకుండా భద్రత కల్పిస్తున్నదని బీజేపీ రాజస్థాన్ రాష్ట్ర నాయకుడు లాదులాల్ పిటాలియా కొనియాడారు. రాజస్థాన్ నుంచి నల్లగొండ జిల్లా కట్టంగూర్కు వచ్చి హోటల్స్ నడుపు తున్న వ్యాపారులను బుధవారం ఆయన కలిసి యోగ క్షేమాలు అడిగి తెలుసుకొన్నారు.
ఈ సందర్భంగా పిటాలియా మాట్లాడుతూ.. కరోనా సమయంలో తెలంగాణ ప్రభుత్వం వలస కార్మికులకు బియ్యం, ఇతర సౌకర్యాలు కల్పించి గొప్పతనం చాటుకొన్నదని అభినందించారు. అనంతరం లాదులాల్ పిటాలియాను టీఆర్ఎస్ నాయకుడు గద్దపాటి దానయ్య, హోటల్ నిర్వాహకులు ధర్మేందర్ సన్మానించారు.