హైదరాబాద్, మార్చి 10, (నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్: బలహీనవర్గాల ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ను రాష్ట్రం నుంచి బహిష్కరించాలని మాదిగ జేఏసీ వ్యవస్థాపకుడు పిడమర్తి రవి.. డీజీపీ మహేందర్రెడ్డికి విజ్ఞప్తిచేశారు. బుధవారం వినతిపత్రం అందజేశారు. 15లోగా ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్ ఉన్నారు.