న్యూఢిల్లీ: దేశం సుభిక్షంగా ఉండాలని, బీఆర్ఎస్ పార్టీ విజయవంతం కావాలని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన రాజశ్యామల యాగం మరికాసేపట్లో ప్రారంభం కానున్నది. ఈ రాజశ్యామల యాగం కోసం ఇప్పటికే ప్రత్యేక యాగశాలను నిర్మించారు. అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. బీఆర్ఎస్ నేతలు, ఋత్విక్కులు ఢిల్లీకి చేరుకున్నారు.
ఇవాళ ఉదయం 9 గంటలకు 12 మంది ఋత్విక్కులు గణపతి పూజతో రాజశ్యామల యాగాన్ని మొదలు పెట్టనున్నారు. ఇప్పటికే వారు ఢిల్లీకి చేరుకున్నారు. పుణ్యహవాచనం, యాగశాల ప్రవేశం, చండీపారాయణం, మూలమంత్ర జపాలు నిర్వహించనున్నారు. రేపు (బుధవారం) నవ చండీహోమం, రాజశ్యామల హోమం అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. శృంగేరిపీఠం గోపీకృష్ణశర్మ, ఫణి శశాంకశర్మ ఆధ్వర్యంలో హోమాలు జరగనున్నాయి.