నాంపల్లి : నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు రాజగోపాల్ రెడ్డి అబద్ధం ఆడుతున్నారని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా నాంపల్లి మండల కేంద్రంలో మంత్రి, టీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ మూడున్నర సంవత్సరాలలో లేనిది రాజగోపాల్ రెడ్డి కి ఇప్పుడు అభివృద్ధి గుర్తుకొచ్చిందా? అని ప్రశ్నించారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమాన స్థాయిలో ప్రజలకు చేరువ చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు నియోజకవర్గ ఓటర్లు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు. రైతు బంధు, కల్యాణ లక్ష్మి, 24 గంటల విద్యుత్, ఆసరా పెన్షన్ తెలంగాణ ప్రభుత్వం తోనే సాధ్యమైందని ప్రజలకు వివరించారు.