జగిత్యాల : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు (Farmers) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో రాళ్లతో కూడిన వర్షం పడడంతో ధాన్యం(Grains) తడిసి ముద్దవుతుందని వాపోతున్నారు. జగిత్యాల జిల్లా(Jagtial District)లోని ముత్యంపేట గ్రామంలో విషాదం నెలకొని ఉంది. గ్రామానికి చెందిన గీతకార్మికుడు ముత్యపు మల్లేశం తాటి చెట్టు ఎక్కుతుండగా చెట్టుపై పిడుగుపడి (Lightning) అక్కడికక్కడే మృతి చెందాడు.
జిల్లాలోని మేడిపల్లి భీమారం మండలం గోవిందారంలో పిడుగుపాటుకు 20 మేకలు మృతి చెందాయి. మల్యాల మండలం మద్దుట్ల గ్రామంలో రాళ్ల వర్షం కురిసింది. కోరుట్లలోని కిష్టంపేటలో పిడుగుపాటుకు నాగుల రవి కి చెందిన గేదె మృతి చెందింది. ఈదురుగాలులతో కూడిన మోస్తారు వర్షం కురిసింది. కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. సిరిసిల్లా మండలం దమ్మనపేటలో ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ షాక్ తో అన్నం నర్సగౌడ్కు చెందిన పాడి గేదె మృతి మృతి చెందింది.