హైదరాబాద్ : నైరుతి రుతుపవనాల ప్రభావంతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు పడాయని వెల్లడించింది. ఇవాళ, రేపు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. కిందిస్థాయి నుంచి పశ్చిమ గాలులు బలంగా వీస్తున్నాయని వాతావరణ శాఖ వివరించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.