హైదరాబాద్ : రైళ్లలో బాంబు పెట్టామంటూ రైల్వే పోలీసులకు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. విశాఖ నుంచి సికింద్రాబాద్ వచ్చే రైళ్లలో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. అగంతకుడి ఫోన్ కాల్తో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు.
కాజీపేటలో ఎల్టీటీ ఎక్స్ప్రెస్ను, చర్లపల్లిలో కోణార్క్ ఎక్స్ప్రెస్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రైలు బోగీల్లో జాగిలాలతో తనిఖీలు చేస్తున్నారు. అనుమానాస్పద వస్తువులను పరిశీలిస్తున్నారు పోలీసులు.