Rahul Gandhi | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధంఖర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. చైర్మన్ నిష్పక్షపాతంగా ఉండాలంటూ చురకలంటించింది. హోమియోపతి దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాజ్యసభ చైర్మన్ లండన్లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. విదేశీ పర్యటన సమయంలో ‘రాజకీయ అద్దాలను’ వదిలివేయాలన్నారు. దీనిపై కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రపతి చేసిన ఓ ట్వీట్పై స్పందిస్తూ.. ‘మొదట మీరు 2015లో ఈ అభ్యాసాన్ని ప్రారంభించిన వారికి ఈ సలహా ఇవ్వండి.
ఆ తర్వాత ఇతరులకు ఉపన్యాసం ఇవ్వండంటూ చురకలంటించారు. చైర్మన్ ఎప్పుడూ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ప్రభుత్వాన్ని ఎప్పుడూ పొగడకూడదన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల లండన్లో పర్యటించిన విషయం తెలిసిందే. లండన్ పార్లమెంట్లో మాట్లాడుతూ భారత్లో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని, పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీలు వివాదాస్పద అంశాలను లేవనెత్తిన సమయంలో మైక్లను స్విచ్ ఆఫ్ చేసిందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు దేశంలో దుమారం లేపాయి. ఈ వ్యాఖ్యలను బీజేపీ తప్పుబట్టింది.
पहले आप उनको यह सलाह दीजिए जिन्होंने इस प्रथा को 2015 में शुरू किया था। फिर प्रवचन दीजिए।
दूसरी बात, सभापति महोदय को निष्पक्ष होना चाहिए, हमेशा सरकार का गुणगान नहीं करना चाहिए। https://t.co/QSuj2pyEC8
— Jairam Ramesh (@Jairam_Ramesh) April 10, 2023