నిర్మల్ : రాహుల్ గాంధీపై పార్లమెంట్ అనర్హత వేటువేయడాన్ని అటవీ పర్యావరణ, న్యాయ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(Minister Indrakaran REDDY) తీవ్రంగా ఖండించారు. నిర్మల్ నియోజకవర్గం సోన్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం(BRS Meeting) లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రశ్నించే గొంతు నొక్కేందుకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం(Bjp Government) ఇలాంటి చర్యలకు ఉపక్రమిస్తుందని ఆరోపించారు. కోర్టు తీర్పు ఇచ్చిన 24 గంటల లోపే ఈ నిర్ణయాన్ని ప్రకటించడం దారుణమన్నారు. ఇది అప్రజాస్వామికమని ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుందని ఆన్నారు. ఇలాంటి అమానుష చర్యలను పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు.