వరంగల్చౌరస్తా, మే 5: వరంగల్లోని కాకతీయ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ ఘటన మరువక ముందే మరో ఘటన వెలుగు చూసింది. నర్సింగ్ విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ నర్సింగ్ కళాశాలకు అనుబంధంగా ఉన్న నర్సింగ్ హాస్టల్ నిర్వహణ విషయమై ఓ విద్యార్థిని తన తోటి విద్యార్థినికి ఫోన్లో సమాచారం చేరవేయడంపై కొందరు విద్యార్థినులు చుట్టుముట్టి దురుసుగా ప్రవర్తించారు. ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో బాధితురాలి సోదరుడు ఈ-మెయిల్ ద్వారా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నరేంద్రకుమార్కు ఫిర్యాదు చేయగా అధి కారులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ ఐదుగురు విద్యార్థినులకు హాస్టల్ వసతి రద్దు చేశారు.