హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి రూ.2 లక్షల కోట్ల బడ్జెట్ను కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఢిల్లీలో శుక్రవారం జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్రాజ్ గంగారాంకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ 45.50 లక్షల కోట్లు ఉంటే 56 శాతం జనాభా ఉన్న బీసీలకు కేవలం రూ.2 వేల కోట్లే కేటాయించడం దారుణమని పేర్కొన్నారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని, విద్య, ఉద్యోగ రంగాల్లో అవకాశాలు కల్పించాలని కోరారు. వృత్తిదారులకు సబ్సిడీ రుణాలను మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, డాక్టర్ మారేశ్, మహేందర్, కర్రి వేణుమాధవ్, నీలా వెంకటేశ్, అనంతయ్య, అంగిరేకుల వరప్రసాద్, సాగర్, వేముల రామకృష్ణ, పృథ్వీగౌడ్, డాక్టర్ పద్మలత, కృష్ణమూర్తి, ఉదయ్నేత, రవీందర్, శివ, కిరణ్ భాషయ్య తదితరులు పాల్గొన్నారు.