యాదగిరిగుట్ట, మే 23: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో తొలిసారిగా నగదు రహిత క్యూఆర్ బార్కోడ్ టికెట్ల విక్రయాలను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం నగదు టికెట్లతోపాటు నగదు రహిత టికెట్లను విక్రయిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునే భక్తులు క్యూఆర్ కోడ్తో కూడిన టికెట్ను కొనుగోలు చేసి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ అధికారులు సెల్ఫోన్, ట్యాబ్లలో స్కాన్ చేసిన అనంతరం ఆలయంలోకి అనుమతిస్తారు.
గురువారం పీవోఎస్ మిషన్ల ద్వారా సుమారు 600 టికెట్లను ప్రయోగాత్మకంగా విక్రయించారు. మరి కొద్దిరోజుల్లో రూ.150 టికెట్లతోపాటు నిత్య తిరుకల్యాణం, సుదర్శన నారసింహ హోమం, ఆర్జిత పూజలు, లడ్డూప్రసాద విక్రయాలకు సైతం అమల్లోకి తీసుకురానున్నట్టు ఈవో భాస్కర్రావు తెలిపారు. దేవస్థాన వెబ్ పోర్టల్ yadadritemple.telangana.gov.in లో బుక్ చేసుకోవచ్చని తెలిపారు. దేవస్థానంలో అర్జిత పూజల్లో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ వస్ర్తాలను ధరించాలని ఆలయ అనువంశికధర్మకర్త బీ నరసింహమూర్తి, ఈవో భాస్కర్రావు తెలిపారు.