హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) డైరెక్టర్ (ప్రొడక్షన్)గా పీవీ రాజారామ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఉస్మానియా యూనివర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆయన.. పృథ్వీ, ఆకాష్ తదితర క్షిపణుల తయారీలో ప్రధాన పాత్ర పోషించారు.
ఈ రంగంలో రాజారామ్కు 34 ఏండ్ల అనుభవం ఉన్నది. గతంలో బీడీఎల్ హైదరాబాద్ కంచన్బాగ్ యూనిట్కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, యూనిట్ హెడ్గా కూడా విధులు నిర్వహించారు.