Bharat Ratna : మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం పట్ల ఆయన కుమారుడు పీవీ ప్రభాకరరావు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో ఏండ్లుగా ఈ సమయం కోసం వేచిచూశామని అన్నారు. సంస్కరణలతో పీవీ దేశాన్ని వృద్ధి పధంలో నిలిపారని అన్నారు.
ఇక మాజీ ప్రధాని, తెలుగు తేజం పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించడం ప్రశంసనీయమని ఆయన కుమార్తె వాణీదేవి స్వాగతించారు. పీవీకి భారతరత్న ఆలస్యంగా ప్రకటించినా సంతోషంగా ఉందని అన్నారు. పీవీకి భారతరత్న తెలంగాణకు గర్వకారణమని పేర్కొన్నారు.
ఆర్ధిక సంస్కరణలతో పీవీ నరసింహారావు దేశాన్ని ముందుకు నడిపించారని కొనియాడారు. గొప్ప వ్యక్తులకు సన్మానం మన సంస్కారమని అన్నారు. పీవీకి భారతరత్న ప్రకటించినందుకు ఆమె కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.
Read More :
PV Narasimharao | పీవీకి భారతరత్న తెలంగాణకు గర్వకారణం : పీవీ కుమార్తె వాణీదేవి