ఖమ్మం, మే 17 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): చింతపండు నవీన్కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు ఆయన తన న్యాయవాది ద్వారా మల్లన్నకు నోటీసులు పంపించారు. మంత్రి పువ్వాడ అజయ్పై నిరాధారమైన ఆరోపణలు చేసి ప్రచారం పొందాలనే దురుద్దేశంతోనే తీన్మార్ మల్లన్న తన చానల్ ద్వారా అబద్ధాలను ప్రసారం చేయడంతోపాటు, పత్రికలో కథనాలు ప్రచురించినట్టు సదరు న్యాయవాది పేర్కొన్నారు.
మంత్రి పువ్వాడ పరువుకు భంగం కలిగించేలా అసత్య ప్రచారం చేసిన తీన్మార్ మల్లన్న సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం మంత్రికి రూ.10 కోట్ల పరిహారం చెల్లించాలని పేర్కొన్నారు. వీటితోపాటు చట్ట ప్రకారం చర్యలకు అర్హులవుతారని నోటీసుల్లో సదరు న్యాయవాది పేర్కొన్నారు. 7 రోజుల్లో తన క్లెయింట్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్కు బేషరతు క్షమాపణ చెప్పాలన్నారు.