హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్మాన్ మంగళవారం హైదరాబాద్కు రానున్నారు. ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ కానున్నారు. ప్రస్తుత రాజకీయాలతోపాటు పలు అంశాలపై వారు చర్చించనున్నారు. ఆ తర్వాత పంజాబ్ సీఎం పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. ఫిబ్రవరిలో పంజాబ్లోని మొహాలిలో జరిగే ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో పాల్గొనాల్సిందిగా వారిని ఆహ్వానించనున్నారు.
24న పంజాబ్ స్పీకర్ రాక
పంజాబ్ శాసనసభ స్పీకర్ సర్దార్ కుల్తార్సింగ్ సంధ్వాన్ ఈ నెల 24న తెలంగాణకు రానున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ స్పీకర్ జైకిషన్ సింగ్ రౌరీ, రాజ్యసభ సభ్యుడు విక్రమ్జీత్ సింగ్ సాహ్ని, ఎమ్మెల్యే కుల్వంత్ సింగ్ పండోరి, మరో ఇద్దరు కూడా హైదరాబాద్కు రానున్నారు.