కాటారం: భూపాలపల్లి (Bhupalpally)జిల్లాలోని కాటారం మండలంలో పులి సంచారిస్తున్నది. మండలంలోని శంకరంపల్లి గ్రామ శివారులో ఆదివారం రాత్రి పులి సంచరిస్తుండగా స్థానికులు గుర్తించారు. సమాచారాన్ని అటవీ శాఖ అధికారులు, పోలీసులకు చేరవేశారు. సోమవారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది.. శంకరంపల్లి గోదాం ప్రాంతంలో పులి అడుగులను గుర్తించారు. పులి.. రుద్రారం వైపు వెళ్లిఉండవచ్చని భావిస్తున్నారు. కాగా, అటవీ ప్రాంతంలోకి ఎవరు వెళ్లకూడదని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.