హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): కబ్జాల వల్ల రాష్ట్రంలో ఎన్నో చెరువులు, కుంటలు కుంచించుకుపోయి వాటిలో నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోతున్నదని ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించాలని కోరుతూ జస్టిస్ ఈవీ వేణుగోపాల్ హైకోర్టుకు లేఖ రాశారు. హైదరాబాద్తోపాటు పటాన్చెరు, సంగారెడ్డి, నర్సాపూర్ తదితర ప్రాంతాల్లో 30కిపైగా చెరువులు ఆక్రమణలకు గురైనట్టు వివరించారు. దీంతో ఆ లేఖను పిల్గా పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు పురపాలక, నీటిపారుదల, రెవెన్యూ, హోం శాఖల ముఖ్యకార్యదర్శులు, హెచ్ఎండీఏ చెరువుల పరిరక్షణ కమిటీ, హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లను ప్రతివాదులుగా పేరొన్నది. ఈ పిల్పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపనున్నది.