హైదరాబాద్, ఫిబ్రవరి 8(నమస్తే తెలంగాణ): తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీ పరిధిలో సీనియారిటీని పరిగణనలోకి తీసుకోకుండా, నిబంధనలను పాటించకుండా అక్రమంగా ప్రాంతీయ స్థాయి కో ఆర్టినేటర్లు(ఆర్ఎల్సీ)గా నియామక ఉత్తర్వులను వెంటనే నిలిపివేయాలని పీఆర్టీయూ (టీఎస్) అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, పీఆర్జీటీఏ అధ్యక్షుడు వేమిరెడ్డి దిలీప్రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్లో టీఎమ్మార్ఈఐఎస్ కార్యదర్శి ఐషా మస్రత్ ఖానంకు వారు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్శంగా వారు మాట్లాడుతూ సీనియారిటీని పరిగణనలోకి తీసుకోకుండా 10 మంది ఆర్ఎల్సీలను నియమించడం సరికాదని పేర్కొన్నారు. ఉమ్మడి సీనియారిటీ జాబితాను రూపొందించిన అనంతరం నియామకాలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో పీఆర్జీటీఏ నాయకులు ఉప్పు అశోక్, ఈ శ్రీనివాసాచారి, ఐ నిర్మలానందం, కే రామకృష్ణారెడ్డి, పీ విద్యాసాగర్, పీ విజయ్కుమార్, ఎం నాగేశ్వరరావు, బీ హవిలారాణి, జీ శైలజ, రేష్మాబేగం, షేక్ సుబాని తదితరులు పాల్గొన్నారు.