హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ప్రభుత్వ విద్యావ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఉన్నదని, ఇందుకు తమ సహకారం అందిస్తామని పీఆర్టీయూ టీఎస్ నేతలు తెలిపారు. సోమవారం సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డితో పీఆర్టీయూటీఎస్ నేతలు భేటీ అయ్యారు. ముందుగా, ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు.
నూతన ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు. సీఎంను కలిసిన వారిలో ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు పూల రవీందర్, మోహన్రెడ్డి, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్రెడ్డి, ప్రధానకార్యదర్శి బీరెల్లి కమలాకర్రావులు ఉన్నారు.