హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ బదిలీల్లో స్వల్పమార్పులు చేయాలని పీఆర్టీయూ-తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య, ప్రధానకార్యదర్శి భిక్షంగౌడ్ బుధవారం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయా పదోన్నతులను పెండింగ్లో పెట్టకుండా, ఆ తర్వాతి స్థానంలోని వారికి అవకాశం ఇవ్వాలని కోరారు.
పదోన్నతులను ఆన్లైన్లో కాకుండా మాన్యువల్గా చేపట్టాలని, విద్యార్థుల సంఖ్య సున్నా ఉన్న స్కూళ్లల్లోని పోస్టులను అప్గ్రేడ్ చేసిన బడుల్లో సర్దుబాటు చేయాలని కోరారు.