హైదరాబాద్ : తెలంగాణ శాసనమండలి సభ్యులు డాక్టర్ కాటేపల్లి జనార్దన్ రెడ్డి, కూర రఘోత్తం రెడ్డి గారు, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు పింగిలి శ్రీపాల్ రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు బి మధుసూదన్ రెడ్డి.. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ను సోమవారం కలిశారు.
హైదరాబాద్ జిల్లాలో ఖాళీగా ఉన్న డిప్యూటీ ఈవో పోస్టులను, డిప్యూటీ ఐవో పోస్టులను ప్రధానోపాధ్యాయుల సీనియారిటీ ఆధారంగా తక్షణమే భర్తీ చేయాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ఒక డిప్యూటీ ఈవో రెండు జోన్ల ఇంఛార్జి బాధ్యతలు నిర్వహించడం వల్ల వారు తీవ్ర మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారని పీఆర్టీయూ నాయకులు పేర్కొన్నారు. అందువల్ల ఒక ప్రధానోపాధ్యాయునికి ఒకే ఇంఛార్జి బాధ్యతలు అప్పగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అశోక్, అనిల్ కుమార్ రెడ్డి, వేణుమాధవ్ పాల్గొన్నారు.