Summer | హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): భూమిపైన ఇప్పటివరకు అత్యంత వేడి సంవత్సరంగా నిలిచిన 2023 లాగానే ఈ ఏడాది వేసవిలోనూ అత్యంత వేడిగా ఉండనున్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ది ప్రొవిజినల్ స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ ైక్లెమెట్ నివేదికలో ఈ విషయం తేటతెల్లమైంది. నిరుడు వేసవిలో ఎల్నినో ప్రభావం మాదిరిగానే ఈ ఏడాది కూడా అవే పరిస్థితులు అలుముకున్నాయి.
దీని ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ మార్పుల వల్లే సాధారణ ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటుచేసుకున్నట్టు తెలిపింది. గ్రీన్హౌస్ వాయువుల వల్ల ఈ వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నదని, వీటి ఫలితంగా సముద్రమట్టాలు పెరుగుతాయని తెలిపింది. ఈనెల చివరివారంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది. మార్చి 20 తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు తెలిపారు.