హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): విద్యార్థుల ప్రాణత్యాగాలతో ఏర్పడిన రాష్ట్రంలో విద్యారంగాన్ని నిర్వీ ర్యం చేయడం సిగ్గుచేటని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ పేర్కొన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 12 ఏండ్లు గడుస్తున్నా విద్యార్థుల సమస్యలు పరిష్కారం కాకపోవడం దౌర్భా గ్యం. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే విద్యాశాఖకు మంత్రి లేకపోవడం కాంగ్రెస్ పాలనా వైఫల్యానికి నిదర్శనం. కొఠారి కమిషన్ సూచనల మేరకు విద్యారంగానికి బడ్జెట్లో 30 శాతం నిధులు కేటాయించాలి. ఇటీవల విద్యాశాఖ కమిషన్ సమర్పించిన నివేదికను బహిర్గతం చేసి, అందులోని అంశాలపై విద్యావేత్తలతో చర్చించాలి. పెండింగ్ రీయింబర్స్మెంట్, సాలర్షిప్లు విడుదల చేయాలి. పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందించాలి’ అని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించడంతోపాటు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తామని హెచ్చరించారు.