ముషీరాబాద్, ఏప్రిల్ 23: గ్రూప్-1,2,3తోపాటు ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న బీసీ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వాలని మంత్రి గంగుల కమలాకర్ను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కోరారు. శనివారం హైదరాబాద్లో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు.
ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతున్న వారికి ఉపకార వేతనం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఫీజు బకాయిలు చెల్లించటంతోపాటు స్కాలర్ షిప్లు, మెస్ చార్జీలు పెంచాలని, పెండింగ్లో ఉన్న 5.77 లక్షల మందికి రుణాలు ఇవ్వాలని, బీసీ కార్పొరేషన్ రాయితీ రుణాల కోసం దరఖాస్తు చేసుకొన్న వారికి మంజూరు చేయాలని, గురుకులాల్లో అదనపు సిబ్బందిని నియమించి విద్యా ప్రమాణాలు పెంచాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. మంత్రిని కలిసిన వారిలో బీసీ యువజన సంఘం అధ్యక్షుడు నీల వెంకటేశ్, ఇతర నాయకులు ఉన్నారు.