హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): క్యాన్సర్ రోగుల పాలిట ప్రోటాన్ భీమ్ చికిత్స వరంగా మారిందని అపోలో వైద్యులు తెలిపారు. ఈ థెరపీపై జరిగిన అవగాహన సదస్సులో రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ చిలుకూరి మాట్లాడుతూ.. క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని, కొత్తగా అందుబాటులోకి వచ్చిన ప్రోటాన్ భీమ్ చికిత్స అధునాతన రేడియేషన్ థెరపీ అని వెల్లడించారు. దక్షిణ భారత్లో తొలిసారి అపోలో దవాఖానలో ప్రోటాన్ క్యాన్సర్ సెంటర్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు వివరించారు. ఈ సెంటర్లో బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న రోగులకు మెరుగైన చికిత్స అందించవచ్చని తెలిపారు. ఇప్పటికే ఇద్దరు బాలికలకు విజయవంతంగా చికిత్స అందించామని చెప్పారు. ఈ థెరపీతో క్యాన్సర్ కణాలు మాత్రమే నాశనం అవుతాయని, దుష్ప్రభావాలు పెద్దగా ఉండవని పేర్కొన్నారు.