హైదరాబాద్ : రైతు భరోసాపై(Rythu bharosa) ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల నుంచి ఆందోళనలు మొదలయ్యాయి. ఒక్కో పంట సీజన్లో ఎకరానికి కేసీఆర్ ఇస్తున్నట్టు రూ.5000 కాకుండా రూ.7,500 ఇస్తానని ఎన్నికల ప్రచార సభల్లో కాంగ్రెస్ ఊదరగొట్టింది. తీరా గెలిచాక ఇప్పుడు ఎకరానికి 12 వేలే ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఇచ్చిన పిలుపుమేరకు.. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమబాట పట్టారు. ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లపై బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

పెద్దపల్లి జిల్లాలో..


మహబూబాబాద్ జిల్లాలో..

వనపర్తి జిల్లాలో..

సూర్యాపేట జిల్లాలో..

హనుమకొండ జిల్లాలో..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో..

కరీంనగర్ జిల్లాలో..