చిగురుమామిడి, ఫిబ్రవరి 19: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో తాగునీటి కోసం మహిళలు గ్రామ ప ంచాయతీ కార్యాలయం ఎదుట సోమవారం ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. తమకు వారం రోజులకు ఒకసారి తాగునీటిని సరఫరా చేస్తున్నారని, అదికూడా సన్నగా వస్తున్నదని, దీనివల్ల చాలా రోజులుగా నీటి కోసం ఇబ్బందులు ఎదురొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
పలుమార్లు గ్రామపంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి కోసం చాలా దూరం వెళ్లాల్సివస్తున్నదని మండిపడ్డారు. ఈ విషయాన్ని గ్రామ ప్రత్యేకాధికారి, తహసీల్దార్ ఇప్ప నరేందర్ దృష్టికి తీసుకెళ్లగా సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిషరిస్తారని హామీ ఇచ్చారు.