హైదరాబాద్ : రెండు డోసుల టీకా తీసుకోంటేనే కరోనాకు వ్యతిరేకంగా పూర్తిస్థాయిలో రక్షణ లభిస్తుందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్రావు తెలిపారు. బుధవారం ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తొలి డోసు తర్వాత నిర్ణీత గడువులోగా రెండో డోసు తీసుకోవాలని సూచించారు. సరైన వేళకు రెండో మోతాదు తీసుకుంటేనే యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని చెప్పారు.
బూస్టర్ డోసుకు మనం ఇంకా దూరంగా ఉన్నామన్న ఆయన.. రెండు రోజుల తర్వాత మాత్రమే పూర్తి రక్షణ ఉంటుందని చెప్పారు. చాలా మంది మొదటి మోతాదు తీసుకున్న వారు సెకండ్ డోసు సరైన వేళకు తీసుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో 36.35లక్షల మందికి రెండుమోతాదుల టీకాలు వేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో 69లక్షల మంది ఒక్క డోసు లేదని పేర్కొన్నారు.