హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈసీ నిబంధనల ప్రకారం.. అక్టోబర్ 9 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు రూ.469.63 కోట్ల విలువైన సొత్తు స్వాధీన పర్చుకొని 11,859 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు తెలంగాణ పోలీసుశాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. రూ.241.52 కోట్ల నగదు సీజ్చేసి, 241 కేసులు, రూ.13.36 కోట్ల విలువైన మద్యం స్వాధీనం చేసుకొని 11,195 కేసులు నమోదు చేసినట్టు వెల్లడించింది. రూ.22.17 కోట్ల విలువైన మత్తు పదార్థాలు, రూ.175.95 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.16.63 కోట్ల విలువైన ఉచితాలను స్వాధీనం చేసుకున్నట్టు వివరించింది. 2018 ఎన్నికల్లో కేవలం రూ.103 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకొని రెండువేలకుపైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు.