నిర్మల్ : ఇస్రో నిర్వహించనున్న వెబ్నార్ శిక్షణ సదస్సుకు నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం చించోలి(బి) గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బాశెట్టి ప్రమోద్రాంకు ఆహ్వానం అందిందని ఆయన తెలిపారు. ఈ నెల 31 నుంచి జూన్ 4వ తేదీ వరకు నిర్వహించే వెబ్నార్లో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయులకు అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం-వాటి అనువర్తనాలు ప్రకృతి వైపరిత్యాలు, పర్యావరణం, శీతోష్ణ స్థితులపై అధ్యయనం తదితర అంశాలపై శిక్షణ అందించనున్నారు.
ఈ మేరకు ఇస్రో శిక్షణ సంస్థ నిర్వాహకుడు, ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ హరీశ్ చంద్ర మెయిల్ ద్వారా ఆహ్వానం పంపినట్లు ప్రమోద్రాం తెలిపారు. ప్రస్తుతం ఈయన మామడ మండలంలోని పరిమండల్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. సదస్సుకు ఎంపిక కావడంపై ఆయనను పలువురు అభినందించారు.
ఇవి కూడా చదవండి..
ఘనంగా హేమాచల లక్ష్మీ నర్సింహస్వామి నాగవెల్లి
పోలీసుల పేరుతో దోపిడీకి పాల్పడిన దొంగ అరెస్ట్
మహబూబాబాద్ ఘటనపై మంత్రి ఎర్రబెల్లి సీరియస్
కరోనా బాధితులను ప్రజా ప్రతినిధులు ఆదుకోవాలి