హైదరాబాద్, ఆగస్టు 22(నమస్తే తెలంగాణ): ఎన్నికల విధుల్లో భాగం గా ఓటర్ల జాబితా రూపకల్పనలో భా గస్వాములైన అధికారుల బదిలీలపై ఎన్నికల సంఘం నిషేధం విధించిం ది. ఈ నెల 21 నుంచి తుది ఓటర్ల జాబితా విడుదలయ్యే అక్టోబర్ 4 వరకు ఈ నిషేధం అమలులో ఉం టుందని పేర్కొన్నది. ఈ మేరకు రా ష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఉత్తర్వులు జారీ చే శారు. ఓటర్ల జాబితా రూపకల్పనలో పాల్గొనే జిల్లా ఎన్నికల (డీఈవో), ఉప జిల్లా ఎన్నికల, ఓటరు రిజిస్ట్రేషన్ (ఈఆర్వో), సహాయ ఓటరు రిజిస్ట్రేషన్ అధికారుల(ఏఈఆర్వో)తోపాటు బూత్ లెవల్ ఆఫీసర్ల (బీఎల్వో) స్థా యి వరకు ఈ నిషేధం వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ అధికారులు సెలవు పై వెళ్లాలనుకుంటే ముందస్తు అనుమతి తీసుకోవాలని, దీర్ఘకాలిక సెలవుపై వెళ్లాలనుకుంటే సీఈవోతో పా టు కమిషన్ అనుమతి తీసుకోవాలని తెలిపారు. ఈ జాబితాలోని పోస్టుల ఖాళీలను భర్తీ విషయంలోనూ ఈ నిషేధం వర్తిస్తుందని పేర్కొన్నారు.