హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): గురుకులాల టీచర్లు, అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కొత్త సంఘం ఆవిర్భవించింది. పీఆర్టీయూ టీఎస్కు అనుబంధంగా ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ గురుకుల టీచర్స్ అసోసియేషన్ (పీఆర్జీటీఏ) ఏర్పడింది. ఆదివారం నారాయణగూడలోని పీఆర్టీయూ టీఎస్ కార్యాలయంలో సంయు క్త సమావేశాన్ని నిర్వహించారు.
ఎమ్మె ల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్రెడ్డి, బీరెల్లి కమలాకర్రావు, మాజీ ప్రధాన కార్యదర్శి గుర్రం చెన్నకేశవరెడ్డి పాల్గొన్నారు.
పీఆర్జీటీఏ రాష్ట్ర అధ్యక్షుడిగా వీ దిలీప్కుమార్రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ ఏ నరేశ్కుమార్, ఉపాధ్యక్షుడిగా ఎం వేణుప్రసాద్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మైనార్టీ గురుకులం కన్వీనర్గా పానుగంటి విజయ్కుమార్, కో-కన్వీనర్గా లక్ష్మారెడ్డి, బీసీ గురుకులం కన్వీనర్గా బీ గట్టయ్య, కో-కన్వీనర్గా ఆర్ రాజ్కుమార్, సోషల్ వెల్ఫేర్ గురుకులం కన్వీనర్గా ఎం నాగేశ్వర్రావు, కో-కన్వీనర్గా ఓరుగంటి నవీన్ ఎన్నికయ్యారు.