Koneru Konappa |కోనేరు కోనప్ప ప్రజల మనిషి. సాయం చేయడం ఆయనకు వ్యసనం సామాన్యుల వెన్నంటే ఉంటారు. ప్రజలకు ఏ ఆపద వచ్చినా తానున్నానంటూ ముందుకు వస్తారు. ఇతోధికంగా సాయం చేస్తూ ప్రజలందరికీ అండగా నిలుస్తున్నారు. ఒకప్పుడు కార్మికుడిగా పనిచేసిన ఆయనకు కార్మికులంటే ప్రాణం. గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. ఆయన చేస్తున్న సహాయానికి ప్రజలు ఫిదా అవుతున్నారు. కోనప్ప సేవలకు సలాం అంటున్నారు నియోజకవర్గ ప్రజలు.
నియోజకవర్గంలో పేపర్ మిల్లు మూతబడితే ప్రభుత్వాన్ని ఒప్పించి ఐదేండ్లలోనే తెరిపించారు. మిల్లు మూతపడ్డప్పుడు కార్మికుల పిల్లల చదువులు ముందుకు సాగలేదు. అలాంటి పరిస్థితుల్లో వందలాది మంది విద్యార్థులకు ఫీజులు కట్టి విద్యాప్రదాత అయ్యారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ద్వారా రూ.2.5 కోట్లు ఫీజులు కట్టించారు. కార్మికుల క్వార్టర్లకు ఉచితంగా విద్యుత్తు, నీటి సరఫరా చేయించారు. విద్యార్థులు ఇంగ్ల్లిష్ సబ్జెక్టులో అత్యధికంగా ఫెయిల్ అవుతున్నారని గమనించిన ఆయన పరిష్కార మార్గాన్ని చూపించారు. ప్రత్యేకంగా ఇంగ్లిష్ పుస్తకాలను రూపొందించి విద్యార్థులకు ఉచితంగా అందజేశారు. దీని ఫలితంగా విద్యార్థులు ఫలితాల్లో అగ్రస్థానంలో నిలిచారు. ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లల్లోని విద్యార్థులు చలికి తట్టుకోలేకపోవడం చూసి చలించి ఉచితంగా ఉలెన్ బ్లాంకెట్స్ అందజేశారు.
ఆకలి తీరుస్తూ.. అండగా ఉంటూ..
కోనప్ప ఇంటివద్దనే వంటలు చేస్తూ పేదల ఆకలిని తీరుస్తున్నారు. కాగజ్నగర్లో 7వేల లీటర్లు, హైదరాబాద్లో 4వేల లీటర్ల అంబలిని ఉచితంగా పంపిణీ చేశారు. నిత్యాన్నదానం చేస్తూ రోజూ 2వేల మంది కడుపులు నింపుతున్నారు. నియోజకవర్గంలోని గర్భిణులకు 2 కిలోల బెల్లం, పల్లిపిండి, రాగిపిండిని ఉచితంగా అందిస్తున్నారు. ప్రభుత్వ దవాఖానకు వచ్చే వారికి ఉచితంగా భోజనాన్ని అందజేస్తున్నారు.
సిర్పూర్.. సిరులపురంగా..
సిర్పూర్ కాగజ్నగర్.. మహారాష్ట్రతో సరిహద్దు గల ప్రాంతం. అనేక విభిన్న ప్రత్యేకతలున్నాయి. తెలంగాణలో తొలి అసెంబ్లీ సెగ్మెంట్. 119 నియోజకవర్గాల్లో నంబర్ -1 సంఖ్య. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే కోనప్ప కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నంబర్ వన్ స్థానంలో నిలుపడానికి కృషి చేస్తున్నారు. సిర్పూరును సిరులపురంగా అభివృద్ధి చేస్తున్నారు. ఒకప్పుడు సర్ సిల్క్స్ మిల్లులో కార్మికుడిగా పనిచేసిన ఆయనకు కార్మికులంటే ప్రాణం. వందలాది కోట్లతో వంతెనలను నిర్మిచారు. ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి రెండు వరుసల రోడ్డు నిర్మించారు. ప్రతి గ్రామానికీ తాగునీటి వసతిని కల్పించారు. కాగజ్నగర్లో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయించారు. ప్రత్యేక నిధులతో మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. ప్రజాఆశీర్వాదాన్ని కోరుతున్నారు.