హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : జేఎన్టీయూ రిజిస్ట్రార్ పోస్టుకు వర్సిటీలోని పలువురు ప్రొఫెసర్లు తీవ్రంగా పోటీపడుతున్నారు. ఎవరికివారు ప్రయత్నాలు ముమ్మరం చేసుకొంటున్నారు. జేఎన్టీయూ ప్రస్తుత రిజిస్ట్రార్ మంజూరు హుస్సేన్ బుధవారం పదవీ విరమణ పొందనున్నారు.
ఈ నేపథ్యంలో కొత్త రిజిస్ట్రార్ను నియమించాల్సి ఉన్నది. వర్సిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ తారాకళ్యాణి, ప్రొఫెసర్ బాలునాయక్, ప్రొఫెసర్ కే వెంకటేశ్వర్రావు, ప్రొఫెసర్ గోవర్ధన్ ఈ రేసులో ఉన్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం.